వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు ఇవ్వలేదని ప్రియురాలిపై హత్యాయత్నం

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari
కడియం(తూ.గో జిల్లా): ప్రియురాలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి, హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం అర్ధరాత్రి దుళ్ళ గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియురాలు (35) రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. దుళ్ళ గ్రామానికి చెందిన మహిళ పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన సుంకర గోవిందుతో ఆమెకు వివాహేతర సంబంధ మేర్పడింది.

కొంతకాలంగా గోవిందు తనను డబ్బుల కోసం వేధిస్తున్నాడని, కూలి పనికి వెళ్లి సంపాదిస్తున్న డబ్బు కూడా బలవంతంగా తీసుకుంటున్నాడని మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. డబ్బులివ్వలేదనే కోపంతో సోమవారం అర్థరాత్రి గోవిందు కిరోసిన్‌ పోసి నిప్పంటించి తనను హతమార్చే ప్రయత్నం చేశాడని ఆమె పేర్కొంది. తీవ్రగాయాల పాలైన ఆమెను స్థానికులు 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలం మేరకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కడియం స్టేషన్‌కు బదిలీ చేశారు. కడియం ఎస్సై కె.శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X