వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వాదనలు అబద్ధం: ఉండవల్లి అరుణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
హైదరాబాద్: తెలంగాణవాదులు చేస్తున్న వాదనలను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పు పట్టారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఓ లేఖ రాశారు. ప్రాంతాలవారీగా జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధిపైనే కాకుండా ఇతర విషయాలపై కూడా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కన్నా తెలంగాణ ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. కోస్తావారి జలదోపిడీ వల్లనే తెలంగాణ వెనకబడిందనే ప్రచారాన్ని వరుస ప్రభుత్వాలు తిప్పికొట్టలేకపోయాయని ఆయన అన్నారు.

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ప్రచారాన్ని వరుస ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ స్థితి వచ్చిందని ఆయన అన్నారు. మూడింట రెండింతల మెజారిటీతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విలీనం జరిగిందని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాల విలీనాన్ని ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) కూడా వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. మంత్రివర్గంలో తెలంగాణవారికి భారీ ప్రాతినిధ్యం లేకుండా ఎప్పుడు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X