వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలోనూ సమైక్యాంధ్ర భావన: చిరంజీవి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
శ్రీకాకుళం: తెలంగాణ ప్రాంతంలోనూ సమైక్యాంధ్ర వాదన చాప కింద నీరులా ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సమయం వచ్చినపుడు ఇది బయటపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర హోంమంత్రి ఎల్లుండి నిర్వహించనున్న అలపక్ష సమావేశంలో రాష్ట్ర విభజనపై స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం లేదనన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ సహా మిగతా పార్టీలు తమ వైఖరిని వెల్లడించాల్సిన అవసరముందని అన్నారు. పొలిటికల్‌ గేమ్స్‌ ఆడాల్సిన అవసరం ఎవరికి లేదని, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలు ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయాయని చిరంజీవి అన్నారు. వీటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X