సీమాంధ్రల్లో కొనసాగుతున్న బంద్

విజయవాడలో ధర్నాకు దిగిన మేయర్ రత్నబిందు, మాజీ మేయర్ మల్లికా బేగంలను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆందోళనకు దిగిన ప్రజారాజ్యం కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బస్ డిపో వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ధర్నాకు దిగారు. కర్నూలులో విద్యాలయాలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అన్ని జిల్లాల్లో ఎక్కడి ఆర్టీసి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. శ్రీకాకుళంలో ఆర్టీసి బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.












Click it and Unblock the Notifications