వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ఢిల్లీ ప్రతినిధుల బొప్పి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తలపెట్టిన రేపటి సమావేశం తలనొప్పిగానే మారింది. హోం మంత్రిత్వ శాఖ సమావేశానికి ఎవరిని పంపాలనే విషయంపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ ప్రాంతాలవారీగా రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆయన ఒక నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగలేని స్థితిలో పడ్డారు. పార్టీపరంగా తెలంగాణకు కట్టుబడినట్లు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయానికి ఇప్పుడు కట్టుబడే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే, దాన్ని తోసిపుచ్చి సమైక్యనినాదాన్ని తీసుకోలేకపోతున్నారు. ఈ స్థితిలో ఆయన గత కొద్ది రోజులుగా చర్చలతో తలమునకలయ్యారు. కానీ ఎటూ తేల్చుకోలేకపోయారు.

సీమాంధ్ర ప్రతినిధిగా యనమల రామకృష్ణుడిని, తెలంగాణ ప్రతినిధిగా నాగం జనార్దన్ రెడ్డిని పంపుతారనే వార్తలు వచ్చాయి. కానీ జనార్దన్ రెడ్డి అందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉంటుందని చెప్పవలసి వస్తేనే తాను వెళతానని ఆయన మొరాయించి కూర్చునట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణకు ప్రతినిధిగా మోత్కుపల్లి నర్సింహులును ఎంపిక చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, చంద్రబాబును ఖాతరు చేయకుండా ఒక వైపు తెలంగాణ నాయకులు, మరో వైపు సీమాంధ్ర నాయకులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందని, ఆ విషాయన్నే తాము ఢిల్లీలో వినిపిస్తామని తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు ఢిల్లీకి బయలుదేరే ముందు అన్నారు. కాసేపట్లో పోలిట్ బ్యూరో సమావేశం జరిగే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X