తాళ్ళరేవులో రోశయ్య సభకు భారీగా మహిళల సమీకరణ

సీఎం రోశయ్య బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఆదివారం చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక జెడ్పీ పాఠశా ల గ్రౌండ్లో టెంట్లు వేయడానికి తాళ్ల సహాయంతో టవర్లు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు స్కూటర్ డ్రైవింగ్ నేర్చుకుంటూ తాళ్లను ఢీకొట్టారు. దాంతో తాళ్లు తెగి ఇనుపటవర్లు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడ్డా యి. అప్పటికి టవర్లపై ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా విద్యు త్ వైర్ల నుంచి పెద్ద శబ్దం, మంటలు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు. విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై సరఫరాను వెంటనే నిలిపివేయడంతో టవర్పై ఉన్న ఇద్దరు యువకులు త్రుటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు.












Click it and Unblock the Notifications