వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ విజయం కొంత ఉంది: కావూరి సాంబశివరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ రేపు నిర్వహిస్తున్న సమావేశంలో తాను సమైక్యవాద ప్రతినిధిగానే తాను పాల్గొంటానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చెప్పారు. రేపటి కేంద్ర హోం శాఖ సమావేశానికి ఎజెండా ఏదీ లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్య పరిష్కారానికి రేపటి సమావేశంతో సమాధానం రాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్రను నిలబెడుతాననే నమ్మకం తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ కాంగ్రెసు నాయకులు కొంత మంది తమ పార్టీ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొంత మేర విజయం సాధించారని ఆయన అన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కెసిఆర్ రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఏ విధంగా చూసినా కోస్తాంధ్ర, రాయలసీమల కన్నా తెలంగాణ ప్రాంతమే అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X