వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి క్యూ కట్టిన రాజకీయ నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలంగాణపై రేపు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఢిల్లీకి క్యూ కట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్లడం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, జయశంకర్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. వారిద్దరు చర్చల్లో పాల్గొంటారు. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఆదివారమే ఢిల్లీ వెళ్లారు. పిసిసి తరఫున కావూరి సాంబశివరావును, ఉత్తమకుమార్ రెడ్డిని చర్చలకు ప్రతినిధులుగా ఖరారు చేసి ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. అయితే చర్చలతో తనకు సంబంధం లేదని, వేరే కార్యక్రమం మీద తాను ఢిల్లీ వచ్చానని ఆయన చెప్పారు. పది రోజుల క్రితమే తన కార్యక్రమం ఖరారైనట్లు ఆయన తెలిపారు.

కాగా, ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రోజంతా అధిష్టానానికి చెందిన వివిధ నాయకులతో చర్చలు జరుపుతారు. ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరం వంటి నాయకులతో ఆయన భేటీ అవుతారు. శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు కూడా వరుసగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ప్రజారాజ్యం తరఫున చిరంజీవి, సి. రామచంద్రయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పటి వరకు తన ప్రతినిధులను ఖరారు చేయలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X