వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో చిరంజీవికి తెలంగాణ చెక్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి రేపటి ఢిల్లీ సమావేశంలో చెక్ పెట్టేందుకు తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రేపటి సమావేశానికి తమను కూడా ఆహ్వానించాలని తెలంగాణకు చెందిన ప్రజారాజ్యం శాసనసభ్యులు మహేశ్వరరెడ్డి, అనిల్ కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కోరారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన చిరంజీవి మాట మార్చి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఓట్లను బట్టే పార్టీలను సమావేశానికి ఆహ్వానించినందున ప్రజారాజ్యం పార్టీకి పడిన ఓట్లలో తెలంగాణ ఓట్లు కూడా ఉన్నాయని, ఆ ఓట్లు కూడా తాము తెంలగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పినందుననే పడ్డాయని వారు వాదిస్తున్నారు.

చిరంజీవి ఓటర్లకు ఇచ్చిన హామీని, పార్టీ నిర్ణయాన్ని మార్చుకున్నారని, అది సమంజసం కాదని వారంటున్నారు. ఈ స్థితిలో రేపటి సమావేశంలో తెలంగాణవాదానికి ప్రాతినిధ్యం లేకుండా చిరంజీవి చేస్తున్నారని, అందువల్ల రేపటి సమావేశంలో తమకు కూడా అవకాశం కల్పించాలని ఆ ఇద్దరు శాసనసభ్యులు కోరుతున్నారు. చిదంబరానికి వారు ఓ లేఖ రాశారు. చిదంబరాన్ని కలిసేందుకు వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే వారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లైను కలిసినట్లు తెలుస్తోంది. చిరంజీవి వైఖరిని తెలంగాణ నాయకులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X