వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ తో సహా ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీల నాయకులు హస్తినలో మోహరించారు. తెలంగాణ వ్యతిరేక, అనుకూల వర్గాలు ఢిల్లీకి చేరి తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. గవర్నర్ నరసింహన్ చిదంబరంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా చిదంబరంతో సమావేశమయ్యారు. కాంగ్రెసు కోర్ కమిటీకి చెందిన నాయకులను ఆయన విడివిడిగా కలుసుకుంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా చిదంబరంతో భేటీ అయ్యారు. తాను రేపటి సమావేశంలో పాల్గొనడం లేదని, అందుకే ముందుగా తాను చిదంబరంతో భేటీ అయ్యానని శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నేతలు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. వారు ఆ తర్వాత కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో బేటీ అయ్యారు. లగడపాటి, జెసి దివాకర్ రెడ్డి వంటి సీమాంధ్ర నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఒక వైపు తెలంగాణ నేతలు, మరోవైపు సీమాంధ్ర నేతలు లాబీయింగులో మునిగి తేలుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కె. చంద్రశేఖర రావు జాతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ తో భేటీ అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X