వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహారాష్ట్రలో టెంపో బోల్తా: 16 మంది మృతి
టెంపో బోల్తా పడడంతో చాలా మంది ధాన్యం బస్తాల కింద చిక్కుకుపోయారు. దాంతో ప్రమాదం నుంచి వారు తప్పించుకోలేకపోయారు. మృతుల్లో చాలా మంది కర్నాటకలోని అఫ్జల్పూర్, గంగపూర్ ప్రాతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. ముంబైకి వంద కిలో మీటర్ల దూరంలో గల రాయగఢ్ జిల్లాలోని పెన్ లో పనిచేయడానికి వారు వెళ్తున్న సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద స్థలికి స్థానికులు పెద్ద యెత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్లో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలున్నారు. బాధితుల కుటుంబాలను సంప్రదించేందుకు మహారాష్ట్ర పోలీసులు కర్నాటక పోలీసులతో మాట్లాడుతున్నారు. గాయపడినవారిలో 18 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెంపో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Comments
Story first published: Tuesday, January 5, 2010, 10:44 [IST]