అపోహలు తొలగించేందుకే సమావేశం: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై తాము చేసిన ప్రకటనపై అపోహలు తొలిగించేందుకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ వేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మంగళవారం ప్రారంభోపన్యాసం చేశారు. విస్తృత చర్చలకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పోరాటానికి సుదీర్ష చరిత్ర ఉందని, తెలంగాణ చరిత్ర అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్రను ఆయన గుర్తు చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం రద్దయ్యాయని, ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ గురించి కూడా అందరికీ తెలిసిందేనని ఆయన ఫజల్ అలీ కమిషన్ నివేదిక గురించి ప్రస్తావించారు. సమస్య పరిష్కారానికి అందరూ కలిసి రావాలని, చర్చల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య మీ అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణ డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగులో ఉందని ఆయన గుర్తు చేశారు. చర్చలు ఎలా ఉండాలో ఈ సమావేశంలో నిర్ణయిద్దామని ఆయన సూచించారు.

రాజకీయ పార్టీలన్నీ 2009 ఎన్నికల ప్రణాళికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై తాము తొందరపడి ప్రకటన చేయలేదని, అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతనే ప్రకటన చేశామని, రాజకీయ పార్టీలు మరో అడుగు ముందుకు వేస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. ఆందోళనల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితి రాకూడదంటే రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు ఆపాలని, అన్ని పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్య పరిష్కారానికి కేంద్రంతో సహకరించాలని ఆయన అన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా రాజకీయ పార్టీలు వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+