తెలంగాణపై కాల పరిమితికి చిదంబరం నో?

కాగా, కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వ్యతిరేకించినట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వెంటనే ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో శాంతి పరిస్థితులు నెలకొన్న తర్వాత తదుపరి చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెసు తెలంగాణ ప్రతినిధి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పరిస్థితులను వివరించామని కాంగ్రెసు సీమాంధ్ర ప్రతినిధి కావూరి సాంబశివ రావుచెప్పారు. తమ వాదనలు సమావేశంలో వివరించామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. కేంద్రం ప్రకటన తర్వాత ప్రతిస్పందిస్తామని కెసిఆర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తమ అభిప్రాయం చెప్పామని తెలుగుదేశం ప్రతినిధులు చెప్పారు. నిర్దిష్ట కాల పరిమితి విధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని కోరినట్లు టిడిపి తెలంగాణ ప్రతినిధి రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. సమావేశంలో సమైక్యవాదులుతమ వాదనను గట్టిగా వినిపించలేదని సమాచారం. విస్తృత ప్రాతిపదికపై చర్చలు అవసరమని కొన్ని పార్టీలు చెప్పాయని కావూరి సాంబశివ రావు చెప్పారు. తమ పార్టీ తరఫున ఉన్న పరిస్థితులను చెప్పామని ఆయన అన్నారు. కాగా, ఈ సమావేశం తర్వాత కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. కోర్ కమిటీలో సమావేశం చర్చలపై విస్తృతంగా చర్చించి ఒక నిర్ణయాన్ని చిదంబరం వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications