స్పష్టమైన ప్రకటన రాలేదు: చిరంజీవి

రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదని, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన అన్నారు. చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. చిదంబరం అభిప్రాయ సేకరణకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చిదంబరం చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మాత్రమే నిర్దిష్టమైన వైఖరితో లేవని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications