చర్చల పూర్తికి కాల పరిమితి: చిదంబరం

రాష్ట్ర విభజన విషయంలో ప్రభుత్వ వైఖరిని తాను వెల్లడించలేనని, సమావేశం సారాంశాన్ని తాను ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన చెప్పారు. తదుపరి చర్చలకు ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, మళ్లీ చర్చలు కావాలని కూడా అడగలేదని ఆయన చెప్పారు. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని, అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. కేంద్రంలోని పెద్దలతో మాట్లాడని తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆయన అన్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోవద్దని ఆయన అన్నారు. తగిన సమయంలో సంప్రదింపుల ప్రక్రియ మొదలవుతుందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి తగిన సమయం ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications