వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ ఆందోళనలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతుండగా, సమైక్య నినాదంతో సీమాంధ్ర ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతాల్లో సమైక్యవాదులు పలు చోట్ల రైల్ రోకోలు నిర్వహించారు. గుంటూరు, అనంతపురం వంటి ప్రాంతాల్లో రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పలు రైళ్లను నిలిపేశారు. సీమాంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే బస్సులు కూడా చాలా వరకు నిలిచిపోయాయి. రైల్ రోకో నిర్వహించిన సమైక్య ఉద్యమ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, మల్లాది విష్ణు, మండలి బుద్ధప్రసాద్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ అంతటా ఆందోళనలు సాగుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. వరంగల్లు, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో రైళ్లను ఆపేశారు. హైదరాబాదులోని ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ జెఎసి నేత శ్రీహరిని నల్లగొండ జిల్లా కోదాడలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో రాస్తారోకో నిర్వహించారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియాలోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. హైదరాబాద్ పరిసరాల్లో రాస్తారోకోలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఎడ్లబండ్ల ప్రదర్శన జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X