వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడెక్కిన ఢిల్లీ: ఎవరి వాదాలు వారివే

By Pratap
|
Google Oneindia TeluguNews

Anti-Telangana
న్యూఢిల్లీ: తెలంగాణపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరాయి. సమావేశం జరుగుతున్న నార్త్ బ్లాక్ వద్ద తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలు మారుమ్రోగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రాంతాలవారీగా విడిపోయి నాయకులు తమ వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల నినాదాలు చేస్తుండగా, సీమాంధ్ర నాయకులు సమైక్య నినాదాలు చేస్తున్నారు. వారి చుట్టూ మీడియా ప్రతినిధులు తిరుగుతూ వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

రాజకీయ నాయకులు ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు, దానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తుండగా రాష్ట్రాన్ని విభజించడం తగదని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సమావేశం వివరాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కేంద్ర నిర్ణయం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకుని ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు నార్త్ బ్లాక్ వద్ద నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్ తెలంగాణ నినాదాలు చేశారు. ప్రాంతాలవారీగా తమ పార్టీ ప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించడానికి కాంగ్రెసు పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఇద్దరు కూడా తమ వ్యతిరేక వాదనలను సమావేశంలో పెట్టనున్నారు. సిపిఎం సమస్యను త్వరిత గతిని పరిష్కరించాలని, నిర్దిష్టమైన ప్రకటన చేయాలని కోరే అవకాశం ఉంది. బిజెపి, సిపిఐ ప్రతినిధులు ఒకే మాటగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలపనున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు సమైక్యవాదాన్ని వినిపించనున్నారు. మజ్లీస్ ప్రతినిధుల అంతరంగం బయటపడడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X