వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా 3840 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు. జనవరి 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోమవారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రత్యేక బస్సుల్లో వేళ్లేవారు ముందుగానే సీట్లను రిజర్వ్‌ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్లలో సీటు రిజర్వ్‌ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు.

ఆర్టీసీ అధీకృత ఏజెంట్స్‌ (ఏబీటీ) వద్ద, ఈ-బుకింగ్‌ ద్వారా కూడా రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజధాని నుంచి విజయవాడకు 1450, గుంటూరుకు 495, పశ్చిమగోదావరికి 140, తూర్పుగోదావరికి 130, విశాఖపట్నంకు 75, ఒంగోలుకు 455, నెల్లూరుకు 80, కర్నూలుకు 310, కడపకు 85, అనంతపురంకు 85, తిరుపతికి 60, ఖమ్మంకు 195, వరంగల్‌కు 230 మెదక్‌కు 230 బస్సు సర్వీసులు నడుస్తాయని తెలిపా రు. ప్రయాణీకుల రద్దీని బట్టి అవసరమైతే అప్పటికప్పుడు అదనపు బస్సులను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఏపీఎస్‌ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఏటీఎం శ్రీనివాసరావు, డిప్యూటీ సీటీఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X