వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతాలుగా విడిపోదాం: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తమ జన్మహక్కు అని రాజకీయ, ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. సమైక్యాంధ్ర అనేది భావన అని, తెలంగాణ తమ జన్మహక్కు అని ఆయన అన్నారు. నేడు మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు సమావేశం విధివిధానాలను మాత్రమే ఖరారు చేస్తుందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమానత కోసమే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ప్రజాస్వామికంగా అభివృద్ధి జరగాలని, అందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామని ఆయన సీమాంధ్ర నేతలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజనకు సహకరించాలని, చర్చలు జరుపుకుందామని ఆయన అన్నారు. సమైక్యవాదులు హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన సోమవారం స్పష్టం చేశారు. సమైక్యవాదుల సమావేశాన్ని అడ్డుకుంటామని విద్యార్థుల జెఎసి హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఆ విధంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X