వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్ 'అదుర్స్' థియేటర్స్ పై టీఅర్ఎస్ దాడులు
ఓపక్క చిత్ర ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు డిజిపి చెబుతుండగానే, ఇక్కడ ఆందోళనకారులు ఈ విధంగా థియేటర్లపై దాడులకు దిగుతుండడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది.జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా విడుదలకు రాష్ట్ర హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అదుర్స్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కొన్ని సంఘాల నాయకులు హెచ్చరించిన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో తెలంగాణ జన జాగృతి కన్వీనర్ కవిత, తెలంగాణ విద్యార్థి సంఘాల జెఎసి నేతలు, రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై హైకోర్టు డిజిపి గిరీష్ కుమార్ ను నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు డిజిపి నివేదిక సమర్పించారు.
Comments
Story first published: Tuesday, January 12, 2010, 17:45 [IST]