వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐకి సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు: సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి చుక్కెదురైంది. గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ లో సోహ్రాబుద్దీన్ ను హత్య చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని సోహ్రాబుద్దీన్ సోదరుడు సుప్రీంకోర్టు దరఖాస్తు చేసుకున్నాడు.

సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులు సస్పెండ్ అయిన డిఐజి డిజి బంజారా, ఆర్ కె పాండియన్, దీనేష్ ఎంఎన్ ప్రధాన నిందితులు. గుజరాత్ డిఎస్పీ ఎన్ కె అమీన్ కూడా నిందితుడు. వారంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వెళ్తుండగా 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా సోహ్రాబుద్దీన్ ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకున్నట్లు సమాచారం. సోహ్రాబుద్దీన్ ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. సోహ్రాబుద్దీన్ భార్య కౌసర్ బీని, మరో వ్యక్తి తుల్సీ రామ్ ప్రజాపతిని కూడా గుజరాత్ పోలీసులు కాల్పి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X