ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసి బస్సు భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.