వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుర్స్ పై గవర్నర్ కు శ్రీవైష్ణవుల ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Adurs
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. అదుర్స్ సినిమాపై శ్రీవైష్ణవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆచారాలను కించపరిచే విధంగా అదుర్స్ సినిమాలో ఓ పాట ఉందని ఆరోపిస్తూ శ్రీవైష్ణవ సేవా సమితి బుధవారం ఉదయం గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సమితి ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఆ పాటను సినిమా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ ను కోరారు.

కాగా, అదుర్స్ కథ తనదేనని కరీంనగర్ కు చెందిన రామిరెడ్డి అనే విద్యార్థి గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదులోని కూకట్ పల్లి భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లకు మంగళవారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని, ధియేటర్లో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు పోన్ చేసి యాజమాన్యాన్ని హెచ్చరించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X