ఆలస్యంగా స్వగ్రామానికి అయ్యప్పల మృత దేహాలు
షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 12 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉందని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు. ఘోర దుర్ఘటన జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని బాధిత కుటుంబాలు వాపోయాయి. కడసారి చూపు కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం రాత్రికి కూడా మృతదేహాలు అందకపోవచ్చునన్న సమాచారంతో గ్రామస్తులలో ఆగ్రహం పెల్లుబికింది. కొట్టాయం ఇక్కడకు దాదాపుగా 13 వందల కిలోమీటర్లు. ఇంత దూరం రోడ్డు మార్గం ద్వారా మృతదేహాలను తరలించటం ఏమిటని, హెలికాప్టర్ ఎందుకు వినియోగించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ఆర్ఎస్ఎస్ నాయకుల ఫోన్ కాల్తో కేరళ అయ్యప్ప సేవా కేంద్రం ప్రతినిధులు బాగానే స్పందించారు.
తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కేరళ సీఎం అచ్యుతానందన్ను, దేవాదాయశాఖ మంత్రి రామచంద్రన్ను కలిసి మృతులకు ఐదు లక్షల వంతున, గాయపడిన వారికి లక్ష రూపాయల వంతున ఏక్స్గ్రేషియా అందించాలని కోరారు. జిల్లా మంత్రి కేపీ సారథి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను బుధవారం కొట్టాయం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తామని చెప్పారు.