వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యంగా స్వగ్రామానికి అయ్యప్పల మృత దేహాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabarimala Yatra
నందిగామ: కేరళ రాష్ట్రంలో ఎరిమెలి వద్ద మృతిచెందిన అయ్యప్పస్వాముల భౌతికకాయాలు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రికి అనాసాగరం గ్రామానికి చేరుకున్నాయి. మృతదేహాలను రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నందున ఎక్కువ సమయం పట్ట్టింది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన 11 మందికి బుధవారం కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కొట్టాయం డిప్యూటీ తహసీల్దార్‌ రమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో 11 మృతదేహాలను ఆరు అంబులెన్సులలో అనాసాగరం తీసుకువచ్చారు. బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో అక్కడ బయలు దేరారు.

షెడ్యూల్‌ ప్రకారం గురువారం రాత్రి 12 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉందని డిప్యూటీ తహసీల్దార్‌ చెప్పారు. ఘోర దుర్ఘటన జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని బాధిత కుటుంబాలు వాపోయాయి. కడసారి చూపు కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం రాత్రికి కూడా మృతదేహాలు అందకపోవచ్చునన్న సమాచారంతో గ్రామస్తులలో ఆగ్రహం పెల్లుబికింది. కొట్టాయం ఇక్కడకు దాదాపుగా 13 వందల కిలోమీటర్లు. ఇంత దూరం రోడ్డు మార్గం ద్వారా మృతదేహాలను తరలించటం ఏమిటని, హెలికాప్టర్‌ ఎందుకు వినియోగించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల ఫోన్‌ కాల్‌తో కేరళ అయ్యప్ప సేవా కేంద్రం ప్రతినిధులు బాగానే స్పందించారు.

తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కేరళ సీఎం అచ్యుతానందన్‌ను, దేవాదాయశాఖ మంత్రి రామచంద్రన్‌ను కలిసి మృతులకు ఐదు లక్షల వంతున, గాయపడిన వారికి లక్ష రూపాయల వంతున ఏక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. జిల్లా మంత్రి కేపీ సారథి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను బుధవారం కొట్టాయం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X