వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ లో 22న తెలంగాణ వైద్యుల ఘర్జన
రాష్ట్రంలో 42శాతం ఉన్న తెలంగాణ ప్రజలకు ఎంతో అన్యాయం జరిగినందుకే తాము ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్నామని తెలంగాణ డాక్టర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ బాబురావు తెలిపారు. దీనికి వైద్య రంగంతో సంబంధం ఉన్న అన్ని శాఖలకు చెందిన వారు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
తెలంగాణ డాక్టర్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ నర్సింగ్ అసోసియేషన్, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, ఎన్ఆర్ఐ డాక్టర్స్, స్టానర్స్ అసోసియేషన్, ఏపీ మెడికల్ అసోసియేషన్, ఆయర్వేద, సిద్ద, యునానీ విభాగాల మద్దతు ఉందన్నారు. పది జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు, ఉద్యోగులు ఈ వైద్య మహా గర్జనలో పాల్గొంటున్నారని తెలిపారు.
Story first published: Friday, January 15, 2010, 15:21 [IST]