వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లో 22న తెలంగాణ వైద్యుల ఘర్జన

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: తెలంగాణలో వైద్య రంగానికి తీరని అన్యాయం జరిగిందని తెలియజేసేందుకే 22న వైద్య మహా గర్జనను నిర్వహిస్తున్నామని తెలంగాణ డాక్టర్స్‌ ఫోరం చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎ.గోపాల్‌ కిషన్‌ తెలిపారు. విలేఖరుల సమావేశంలో పలువురు వైద్యులు పాల్గొని తెలంగాణలో వైద్య రంగానికి జరిగిన అన్యాయాలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణలోని మెడికల్‌ కళాశాలల్లో ఉన్న సీట్లతో పాటు ఉద్యోగాలను సైతం ఆంధ్ర ప్రాంతం వారే ఎక్కువ పొందుతున్నారని అన్నారు. ఈ అన్యాయాన్ని ప్రభుత్వానికి చెప్పేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించినా తమనే అణగదొక్కేందుకు ప్రయత్నించారని తెలిపారు.

రాష్ట్రంలో 42శాతం ఉన్న తెలంగాణ ప్రజలకు ఎంతో అన్యాయం జరిగినందుకే తాము ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్నామని తెలంగాణ డాక్టర్స్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ బాబురావు తెలిపారు. దీనికి వైద్య రంగంతో సంబంధం ఉన్న అన్ని శాఖలకు చెందిన వారు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

తెలంగాణ డాక్టర్స్‌ ఫోరం, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఏపీ నర్సింగ్‌ అసోసియేషన్‌, జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్స్‌, స్టానర్స్‌ అసోసియేషన్‌, ఏపీ మెడికల్‌ అసోసియేషన్‌, ఆయర్వేద, సిద్ద, యునానీ విభాగాల మద్దతు ఉందన్నారు. పది జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు, ఉద్యోగులు ఈ వైద్య మహా గర్జనలో పాల్గొంటున్నారని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X