వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాపై తెలంగాణ దాడి జరగలేదు: దానం
సోనియా గాంధీకి తెలంగాణ అంశాన్ని వదిలేసిన తర్వాత, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ కోసం ఆందోళనలు సరి కాదని ఆయన అన్నారు. యాభై ఏళ్లుగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆందోళనలు కొనసాగితేనే శాంతి ర్యాలీ నిర్వహిస్తామని, అన్ని పార్టీలతో చర్చించి శాంతి ర్యాలీపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శాంతి ర్యాలీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. రాజీనామాల ఉపసంహరణపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పారు. అందరి రక్షణకు తాను ముందుంటానని ఆయన చెప్పారు.
Story first published: Saturday, January 16, 2010, 16:19 [IST]