వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి గవర్నర్ గా నరసింహన్ కు పూర్తి బాధ్యతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఎస్ఎల్ నరసింహన్ కు పూర్తి కాలం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం సమావేశమైన కాంగ్రెసు కోర్ కమిటీ ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ఖరారు చేసినట్లు సమాచారం. అనూహ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్డీ తివారీ తప్పుకోవాల్సి రావడంతో చత్తీస్ ఘడ్ గవర్నర్ గా ఉన్న నరసింహన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. నరసింహన్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐపియస్ అధికారి కావడం, తెలుగు భాష కూడా ఆయనకు రావడం వల్ల ప్రస్తుత స్థితిలో ఆయనకే పూర్తి కాలం బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో నిఘా విభాగం అధికారిగా గతంలో పనిచేసిన ఆయన ఎపి గవర్నర్ గా సరైన వారని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. చత్తీస్ ఘడ్ గవర్నర్ గా శేఖర్ దత్ ను వేస్తున్నారు.

కాగా, నక్సలైట్ల ప్రాబల్యంతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ పంపుతున్నారు. జార్ఖండ్ కు మొహిసినా కిద్వాయ్ ని వేశారు. మహారాష్ట్రకు శంకరనారాయణ్, రాజస్థాన్ కు ప్రభారావు, పంజాబ్ కు శివరాజ్ పాటిల్, హిమాచల్ ప్రదేశ్ కు ఊర్మిళా బెన్ పటేల్ కొత్త గవర్నర్లుగా నియామకం కానున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X