వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాఠీ చార్జి, 12మందికి గాయాలు, విద్యార్ధుల రాళ్ళ దాడి

By Santaram
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వేణుగోపాల్‌ మృతదేహాన్ని గన్‌ పార్క్‌ కు తరలించేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపుతప్పటంతో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 12మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు కూడా పోలీసులపై రాళ్లురువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాష్పవాయువు ప్రయోగించి, గాల్లో కాల్పులు జరిపి విద్యార్థులను చెదరగొట్టారు. రాళ్లదాడిలో విద్యార్థులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు.

గాయపడిన విద్యార్థులను గాంధీ, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రులకు తరలించారు. ఓయూ క్యాంపస్‌లో లాఠీచార్జిపై వీసీ తిరుపతిరావు విచారం వ్యక్తం చేశారు. పోలీసు వాహనానికి విద్యార్థులు నిప్పు పెట్టటంతో పూర్తిగా దగ్థమైంది. ఉస్మానియా యూనివర్శిటీలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో వేణుగోపాల్‌ రెడ్డి మృతదేహంతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను లేడీస్‌ హాస్టల్‌ వద్ద అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X