వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

27న చిరంజీవి గుంటూరు పర్యటన, ధర్నా

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
గుంటూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈ నెల 27న జిల్లాలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారి పార్టీ కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు రానుండడంతో పార్టీపరంగా పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించి పర్యటనను పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నారు. 27న చిరంజీవి నింగినంటుతున్న నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం, ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీని జిల్లాలో తిరిగి బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలని అధినేత యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో రెండు, మూడు స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకొనే సత్తా సామాజిక ఓట్లు ఉన్నప్పటికీ పార్టీపరంగా అభ్యర్థుల ఎంపికతో జరిగిన చారిత్రక తప్పిదాలు, చివరి నిమిషంలో టికెట్ల కేటాయింపు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X