వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసరలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Basara Saraswathi
ఆదిలాబాద్‌: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్‌జిల్లా బాసర సరస్వతీ దేవాలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో ఇక్కడికి చేరుకుని గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. ఉదయం ఐదుగంటల నంచి దైవదర్శనం, పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బారులు తీరారు. దీంతో ఆలయంలో రద్దీపెరిగింది. సరస్వతీదేవి పుట్టిన రోజున దైవదర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు.

సరస్వతీ దేవి జన్మదినమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విజ్ఞానవంతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే సాధారణ భక్తులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్షరశ్రీకారం పూజలను బుధవారం వేకువ జామున నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మరో పక్క పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలు మంగళవారం నాడే బాసరకు చేరుకున్నాయి.

సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులతో దేవస్థానం వద్ద గల సత్రాలు నిండిపోయాయి. దేవస్థాన గదులన్ని అధికారులు వీఐపీలకు కేటాయించడంతో భక్తులకు ఇక్కట్లు మొదలయ్యాయి. తప్పని పరిస్థితుల్లో వందల మంది భక్తులు ఆలయ పరిసరాల్లోనే నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X