వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవహక్కుల సంఘం ముందుకు కమిషనర్ ఖాన్

By Santaram
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్‌: గడువు ముగిసిన బాష్పవాయువు ప్రయోగంతో ఎటువంటి ప్రమాదం లేదని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే.ఖాన్‌ స్పష్టం చేశారు. విద్యార్థులపై లారీ చార్జ్‌కు సంబంధించి ఓయూ జేఏసీ ఫిర్యాదు దరిమిలా ఏకే ఖాన్‌ గురువారం హెచ్‌ఆర్‌సీ ఎదుట హాజరు అయ్యారు. విద్యార్థులపై గడువు ముగిసిన బాష్పవాయువు ప్రయోగంపై హెచ్‌ఆర్‌సీకి హైదరాబాద్‌ నగర కమిషనర్‌ వివరణ ఇచ్చారు. దీంతో ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. అంతేకాక ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను త్వరలో అందిస్తామని మానవ హక్కుల సంఘానికి కమిషనర్‌ తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటి ఘటనకు సంబంధించి ఓయూ సంయుక్త కార్యాచరణ కమిటి గురువారం మానవ హక్కుల సమితిని ఆశ్రయించింది. హెచ్‌ఆర్‌సిని కలుసున్న ఓయూ జేఏసీ, విద్యార్థులపై పోలీసులు గడువు ముగిసిన బాష్పవాయువును ప్రయోగించారని ఫిర్యాదు చేసింది. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్న వేణుగోపాల్‌రెడ్డి శవయాత్ర సందర్భంగా పోలీసులు-విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ లాఠీచార్జ్‌, బాష్పవాయు ప్రయోగం, రబ్బర్‌ బుల్లెట్లతో కాల్పులకు దారి తీసిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X