వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విద్యార్ధుల ఆగ్రహజ్వాల

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన లాఠీచార్జిని హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి సమర్థించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి వెంటనే తనపదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అర్ధరాత్రి ఆర్ట్స్‌ కళాశాల ముందు దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని విజ్ఞప్తిచేశారు.

హోంమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ మరికొన్ని చోట్ల నుంచి కూడా విన్పిస్తోంది. ఎటువంటి బాధ్యతలూ అధికారాలూ లేని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. అలా చేస్తే..తెలంగాణ కోసం పోరాడిన ఇంద్రారెడ్డి ఆత్మ శాంతిస్తుందన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన దీక్షల్లో ఐదో రోజు ఎమ్మెల్యేలు మహేందర్‌ రెడ్డి, డాక్టర్‌ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు కె.సత్యనారాయణ, శ్రీరాంభద్రయ్య, టీఆర్‌ఎస్‌ నేత వేముల సురేందర్‌రెడ్డితోపాటు 28 మంది కూర్చున్నారు. తమను తెలంగాణ జేఏసీగా పిలవాలని కోదండరాం ఈ సందర్భంగా మీడియాను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X