వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు తిరుమలలో రథ సప్తమి వేడుకలకు రంగం సిద్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఏటా మాఘ శుద్ధసప్తమి, సూర్యజయంతి రోజున సప్తగిరీశుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడువాహనాల్లో మాడవీధుల్లో విహరిస్తాడు.

మధ్యా హ్నం 12గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకొక్కటి మాత్రమే చూడగలిగే ఈ వాహనసేవా వైభవాన్ని రథసప్తమి నాడు ఒకేరోజున తిలకించవచ్చు. ఈ సందర్భంగా నిత్యం ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీసేవలను రద్దు చేశారు.

ఆరోజు ఉదయం నుంచి రాత్రి వ రకు వరుసగా జరిగే ఊరేగింపుసేవలు వివరాలు..ఉదయం 5.30-7 గంటల మధ్య సూర్యప్రభ వాహనం, 9-10 చిన్నశేషవాహనం, 11-12 గరుడవాహనం, మధ్యాహ్నం 12-1 గంటల మధ్య చక్రస్నానం, సాయంత్రం 4-5 కల్పవృక్ష వాహనం, 6-7 సర్వభూపాల వాహనం, రాత్రి 8-9 మధ్య చంద్రప్రభ వాహనం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X