వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడూ బంద్, మేడారం బస్సులకు మినహాయింపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణలో 48 గంటల బంద్‌ గురువారమూ కొనసాగుతుందని తెలంగాణ విద్యార్థుల జేఏసీ, రాజకీయ పార్టీల జేఏసీ ప్రకటించాయి. వేణుగోపాల్‌రెడ్డి అంతిమయాత్ర సమయంలో ఓయూలో లాఠీచార్జి, రబ్బరు బుల్లెట్ల ప్రయోగిం చడాన్ని జేఏసీలు ఖండించాయి. తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్కల జాతర బస్సులకు మాత్రం బంద్‌ నుంచి మినహాయింపునిచ్చాయి.

ఈ జాతరకు వెళ్లే బస్సులు జై తెలంగాణ, సమ్మక్క-సారక్క జాతర స్పెషల్‌ అని బోర్డులు పెట్టుకుని వెళ్లాలని విద్యార్థి జేఏసీ నేతలు సూచించా రు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ గురువారం ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేట్‌ వరకు శాంతిర్యాలీ నిర్వహిస్తామన్నారు.

యూనివర్సిటీలో లాఠీచార్జి, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించడానికి కేవీపీనే బాధ్యుడిని చేసి ఆయన్ను తొలగించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. మంత్రుల అధికారిక కార్యక్రమాలను బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 23న నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ రణభేరికి మద్దతు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X