వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై సోనియా సీరియస్: డి శ్రీనివాస్
రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి సహకరించాలని సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై ప్రజలు సహకరించాలని కూడా సోనియా అన్నట్లు ఆయన చెప్పారు. ఆందోళనల సమయంలో సంయమనం పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని, విద్యార్థుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని సోనియా చెప్పినట్లు ఆయన తెలిపారు. డి. శ్రీనివాస్ గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కూడా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు.
Story first published: Friday, January 22, 2010, 13:27 [IST]