వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైజాక్ ప్రమాదంతో టెర్రర్ అలర్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Airport
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసే ప్రమాదం ఉందని నిఘా సమాచారం అందడంతో ప్రభుత్వం దక్షిణాసియాకు వెళ్లే విమానాలను భారీ భద్రతతో అప్రమత్తం చేసింది. ఆల్ ఖైదా లేదా లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్ కు చెందిన ఏదో క విమానాన్ని హైజాక్ చేసేందుకు కుట్ర చేసినట్లు నిఘా సమాచారం అందింది. భారత్ కు చెందిన అన్ని విమానాలకు ఈ ప్రమాదం ఉంది. అయితే ఇండియా లేదా ఇండియన్ విమానాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకోవచ్చునని అనుమానిస్తున్నారు.

కాబూల్, ఖాట్మండ్ లకు వెళ్లే విమానాలకే కాకుండా కొలంబో, ఢాకా, యాంగోన్ లకు వెళ్లే విమానాలకు కూడా భారీ భద్రత కల్పించారు. సార్క్ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికుల ఒళ్లు తడిమి తనిఖీ చేయడం అనివార్యంగా మార్చారు. 2009లో ఏ విధమైన సంఘటన జరగని నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ విషయంలో పెద్ద దాడికే పాల్పడవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X