వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజన మహిళలపై అత్యాచారం: రోశయ్య సీరియస్

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం బల్లు గూడలో గిరిజన మహిళలపై జరిగిన అత్యాచార అంశం తన దృష్టికి వచ్చిందని దీని బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తూ విశాఖలో కొద్దిసేపు విడిది చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులపై కూడా స్పందించారు.

శాంతి భద్రతల పరిరక్షణలో అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదని, పోలీసులు ధైర్యంగా పోరాడుతున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఎలాంటి ఎద్దడి లేకుండా చూస్తున్నామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X