వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్రపై చిరంజీవికి మమత హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రపై తనకు అవగాహన ఉందని, తగిన సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో అన్నారు. సమైక్యాంధ్రకు కాంగ్రెసు నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) భాగస్వామ్య పక్షాల మద్దతు కూడగట్టడానికి చిరంజీవి ఢిల్లీలో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం మమతా బెనర్జీని కలిశారు. సమైక్యాంధ్రవాదానికి ఆయన మమత మద్దతు కూడగట్టారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని చిరంజీవి మమతా బెనర్జీతో భేటీ అనంతరం విమర్శించారు. రెండు ప్రాంతాల్లో ఉద్యమాలను చేపడుతూ స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. దాని వల్లనే సమస్య తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X