వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిఘానేత్రాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరు బాంబు, ఆరు డాగ్‌స్క్వాడ్‌ లు వేడుకలు జరిగే పరేడ్‌ గ్రౌండ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. మైదానం చుట్టూ ఉన్న చిన్న వ్యాపారులను ఖాళీ చేయిస్తున్నారు.

పేలుడు పదార్థాలను గుర్తించడం, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి రహదారులపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ఉత్తర మండలంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పేలుడు పదార్థాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారుల్లో చురుగ్గా ఉన్న కొంతమంది యువకులకు పేలుడు పదార్థాలను పసిగట్టేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

గణతంత్ర వేడుకల్లో ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. వ్యాపార సంస్థలు, సినిమాహాళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేస్తున్నారు. ప్రార్థనా మందిరాలపై దృష్టి పెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X