సీమాంధ్ర నేతలకు కోదండరామ్ సవాల్

T Jeevan Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఎవరి చేతుల్లో ఉందో చూడడానికి ఈ ప్రాంత పల్లెలకు రావాలని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ సీమాంధ్ర నేతలను సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టులు నడిపిస్తున్నారని సీమాంధ్ర నేతలు చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. తెలంగాణ ఉద్యమం పల్లె పల్లెనా జరుగుతోందని, ఆ పల్లెలకు వచ్చి చూస్తే ఉద్యమం ఎవరి చేతుల్లో ఉందో తెలుస్తుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇటువంటి ప్రకటన వల్ల సమస్య పరిష్కారం కాదని, గాలి మాటల వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి నిర్దిష్టంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఆవిష్కరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మర్నాడు గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ నెల 28వ తేదీన అంతటా ర్యాలీలు తీసి మండల కేంద్రాలకు చేరుకోవాలని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులున్నారని సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి విమర్శించారు. మావోయిస్టుల బూచీ చూపి ఉద్యమాన్ని దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+