వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం విడిపోతే డెల్టా బంజరౌతుంది: ప్రజారాజ్యం

By Santaram
|
Google Oneindia TeluguNews

Prajarajyam
తుని: జిల్లాలో పార్టీని పటిష్ట పరిచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు పీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆదివారం ఆయన తలుపులమ్మ దేవస్థానాన్ని సందర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రం రెండు ముక్కలుగా విడి పోతే గోదావరి డెల్టా బంజరు భూమిగా మారిపోతుందని అన్నారు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 27నుంచి తమ పార్టీ మళ్లీ ఉద్యమం ప్రారంభి స్తుందని చెప్పారు. గుంటూరులో చిరంజీవి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు.

తొలిదశ ఉద్య మాన్ని చిరంజీవి పూర్తి చేశారన్నారు. తదుపరి దశలవారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. చిరంజీవి ఢిల్లీ పర్యటన సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టడమేనన్నారు. ఇతర జాతీయ పార్టీల మద్దతుతో ఐక్యతకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, వసంతల అప్పారావు తదితరులున్నారు.

పార్టీ పటిష్టతకు నియోజకవర్గ విస్తృతస్థా యి సమావేశాలను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, కాకినాడ-1..2, పెద్దాపురం, ముమ్మిడివరం నియోజ కవర్గాల్లో సమావేశాలు పూర్తి చేశా మన్నారు. ఈ నెల 31న పిఠాపురం ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజక వర్గాల సమావేశాలు ఏర్పాటు చేస్తు న్నామన్నారు.

ఫిబ్రవరి నెలాఖరు కల్లా జిల్లా మొత్తం పూర్తి చేస్తామ న్నారు. పార్టీని బలోపేతం చేసే చర్యలతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టనున్నామని నెహ్రూ తెలిపారు. ప్రభుత్వం కార్డుల ఏరివేత పేరుతో పేదలను ఇబ్బం దులకు గురి చేస్తోందని విమర్శిం చారు. దీనిపై తమ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X