వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో సమైక్యాంధ్ర పతాకావిష్కరణ
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ఎ.కిశోర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తాము ఈవిధంగా జెండాను ఎగురవేశామన్నారు. ఈ నెల 28న జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అది సమైక్యాంధ్రాకు అనుకూలంగా వుండేలా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చూడాలని కిశోర్ కోరారు. ఒకవేళ వ్యతిరేక నిర్ణయం వెలువడితే సీమాంధ్ర ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా వుండాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్లు బి.కాంతారావు, గోవింద్, శర్మ, సీతారామ్ పాల్గొన్నారు.
Comments
Story first published: Wednesday, January 27, 2010, 9:30 [IST]