వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుది దశలో తెలంగాణపై కమిటీ: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై కమిటీ ఏర్పాటు తుది దశలో ఉందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో ఈ విషయం చెప్పారు. వారంలోగా కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు సంయమనం పాటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, కాంగ్రెసు తెలంగాణపై కమిటీ లేదా కమిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఆ ముసాయిదాకు రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఆ ముసాయిదాను కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించే అవకాశం ఉంది. క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత చిదంబరం తెలంగాణపై మరో ప్రకటన చేసే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X