వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు బుద్ధి ప్రసాదించాలి: దత్తాత్రేయ

By Pratap
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) గురువారం మేడారం కారు యాత్రను చేపట్టింది. ఈ కారు యాత్రను హైదరాబాదులోని గన్ పార్కు తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. దత్తాత్రేయ, శాసనసభ్యుడు కిషన్ రెడ్డి సహా పలువురు బిజెపి నేతలు కారు యాత్ర చేపట్టారు. దారి పొడవునా కూడళ్లలో రోడ్డు షో నిర్వహిస్తూ కారు యాత్ర సమ్మక్క, సారలమ్మ మేడారం జాతరకు చేరుకుంటుంది.

ఆనాడు ప్రజల కోసం సమ్మక్క, సారలమ్మ ఆత్మబలిదానాలు చేశారని, ఇప్పుడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. తాము నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి తెలంగాణ కోసం ఆశీస్సులు పొందుతామని ఆయన చెప్పారు. తెలంగాణపై సోనియా గాంధీకి బుద్ధి ప్రసాదించాలని కోరుతామని ఆయన అన్నారు. జెఎసి గడువు ముగిసిందని, దాంతో ప్రజాప్రతినిధుల రాజీనామాకు తెలంగాణ జెఎసి ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాల్సిందేనని కిషన్ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X