గ్రీన్ సిటీ హోదాకు మహా విశాఖ ప్రతిపాదనలు
ఈ డీపీఆర్కు సంబంధించి నగరంలో ఎంతమేర ప్రకృతి ఉంది, అడవులు, కొండలు, సాగరతీరం వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలతో అన్ని వివరాలు పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. దీని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదలచేసే అవకాశముందని అధికారులు అంచనాలు రూపొందించారు.
అంతర్జాతీయ సదస్సులో..అర్బన్ గవర్నెన్స్పై గురువారం నుంచి మూడు రోజుల పాటు అహ్మదాబాద్లో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు జీవీఎంసీ కమిషనర్ విష్ణు, ప్రాజెక్ట్స్ అదనపు కమిషనర్ పోల భాస్కర్, చీఫ్ ఇంజనీర్ బి.జయరామిరెడ్డిలు బుధవారం బయలుదేరి వెళ్లారు. విశాఖకు సంబంధించి ఈ సదస్సులో పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
నగరం అందచందాలు, ప్రకృతిగొప్పతనం వివరించి ఇతర నగరాలకంటే మంచి మార్కులు సాధించే అవకాశముందని భావిస్తున్నారు. మహా విశాఖకు మంచి గుర్తింపు రావడం ఖాయమని ఇంజనీరింగ్ అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు అర్బన్ ట్రాన్స్పోర్టు, ప్రాజెక్టులు, పట్టణ పేదల మౌలిక సదుపాయాలతోపాటు పలు అంశాలు చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.