వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం అనుకున్నట్లు లేదు : కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన తాము అనుకున్నట్లు లేదని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణపై వేసే కమిటీకి వారాంతంలోగా పేర్లు ఖరారు చేస్తామని, ఫిబ్రవరి మొదటివారంలో కమిటీ వేస్తామని చిదంబరం ఢిల్లీలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన కావాలని కోదండరామ్ గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తమ ఆందోళనలు ఆగబోవని ఆయన చెప్పారు. కాగా, కమిటీలతో తెలంగాణ ఏర్పడదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. చిదంబరం ప్రకటనను తెలంగాణ ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు.

తెలంగాణపై తమ పార్టీ నాయకురాలు సోనియాపై తమకు నమ్మ కం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. నమ్మకం కుదరకపోతే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి నేతలు సోనియా గాంధీని కలుసుకోవచ్చునని ఆయన అన్నారు. వారు తమ కాంగ్రెసు అధిష్టానం నుంచి స్పష్టత పొందవచ్చునని ఆయన అన్నారు. అయితే, తెలుగదేశం నాయకులు మాత్రం మరో రకంగా ప్రతిస్పందిస్తున్నారు. కాల పరిమితితో కూడిన ప్రకటనతో పాటు తెలంగాణపై బిల్లు పెడతామని ప్రకటించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు వేణుగోపాల చారి డిమాండ్ చేశారు. చిదంబరం ప్రకటనను ఢిల్లీలోని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు జానా రెడ్డి, దామోదర్ రెడ్డి ఆహ్వానించారు. కాగా, తాజా పరిస్థితిపై చర్చించేందుకు తెలంగాణ జెఎసి గురువారం సాయంత్రం సమావేశమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X