హైదరాబాదులో అభ్యంతరం లేదు: మోడీ

కాగా, ఐపియల్ 3 మ్యాచులను విశాఖపట్నంలో నిర్వహించే విషయంపై ఐపియల్ నిర్వాహకులు ఆలోచన చేస్తున్నారు. విశాఖపట్నాన్ని అందుకు అనువైందా, కాదా అనే విషయంపై వారు పరిశీలన జరుపుతున్నారు. ఐపియల్ లో పాకిస్తాన్ క్రీడాకారులకు స్థానం కల్పించబోతున్నారు. ఐపియల్ లో పాకిస్తాన్ క్రీడాకారులకు స్థానం కల్పించకపోవడంపై భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో పాక్ క్రీడాకారులను ఐపియల్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ కు చెందిన దక్కన్ చార్జర్స్ తరఫున పాకిస్తాన్ క్రీడాకారుడు అబ్దుల్ రజాక్ ఆడనున్నాడు.












Click it and Unblock the Notifications