వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం మరొకరి మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ కోసం మరో వ్యక్తి మరణించాడు. రాజశేఖర్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఇటీవల తెలంగాణ కోసం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆయనను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆతను గురువారం మరణించాడు. అతని మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఈటెల రాజేందర్, వినోద్ కుమార్ సంతాపం ప్రకటించారు.

రాజశేఖర్ మృతదేహంతో తెరాస కార్యకర్తలు హైదరాబాదులోని గన్ పార్కు వద్ద ధర్నాకు దిగారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకపోతే విద్యార్థులు మానవ బాంబులుగా మారే ప్రమాదం ఉందని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితితో ప్రకటన చేయకపోతే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఆయన అన్నారు. రాజశేఖర్ మృతిపై విచారణ జరిపించాలని వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X