కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు. రాజీనామాలకు జెఎసి విధించిన గడువు ముగియడానికి ఇంకా సమయం ఉందని, ఈలోగా కేంద్రం సానుకూలంగా ముందుకు వస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆయన గురువారం విడిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యతను గమనించింది కాబట్టే తెలంగాణ ప్రక్రియకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు.
రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాల్సిన అవసరం లేదని, గడువులతో సంబంధం లేకుండా సాగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ నేతలు గురువారం కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. సోనియాపై తమకు స్పష్టమైన విశ్వాసం ఉందని, నిర్ణీత కాలవ్యవధితో తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం తమకు ఉందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications