వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం తెలంగాణ కోసం కమిటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
: తెలంగాణపై సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసే కమిటీని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి సమావేశమైన కాంగ్రెసు కోర్ కమిటీ కమిటీ రూపకల్పనపై కసరత్తు చేసింది. కమిటీ సభ్యులపై, విధివిధానాలపై, అధ్యక్షుడిపై, కాలపరిమితిపై కోర్ కమిటీలో చర్చించారు. ఈ కోర్ కమిటీ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలతో సహా కేంద్ర మంత్రులు పి. చిదంబరం, వీరప్ప మొయిలీ, ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ హాజరయ్యారు. ప్రణబ్ ముఖర్జీ రాలేదు. దాంతో కోర్ కమిటీ తెలంగాణపై వేయాల్సిన కమిటీకి తుది రూపు ఇవ్వలేకపోయింది.

కోర్ కమిటీ చర్చల వివరాలను ప్రణబ్ ముఖర్జీకి తెలిపి ఆయన అభిప్రాయం కూడా తీసుకుని కమిటీపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కమిటీ కూర్పు అనేది న్యాయశాఖకు సంబంధించింది కాబట్టి హోం మంత్రి చిదంబరంతో పాటు వీరప్ప మొయిలీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కమిటీ అధ్యక్షుడిగా శ్రీకృష్ణ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. దాదాపుగా ఆయనే ఖరారు కావచ్చునని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అహ్మద్ పటేల్ ధ్రువీకరించలేదు. కమిటీ ఏర్పాటు కావడానికి రెండు మూడు రోజులు పడుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X